National Awards: ఉత్తమ విద్యార్థులకు జాతీయ పురస్కారాలు
Sakshi Education
బూర్గంపాడు: ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జాతీయ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సులోచనారాణి తెలిపారు.
ఉత్తమ విద్యార్థులకు జాతీయ పురస్కారాలు
బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 11న ఇంటర్మీడియట్లో 973 మార్కులు సాధించిన సుంకర మేఘన, 971 మార్కులు సాధించిన కోట అక్షయ, తెల్లబోయిన శిరీష, 948 మార్కులు సాధించిన షేక్ ముబీనాలకు పురస్కారాలను అందించారు.
జాతీయ ప్రతిభా పురస్కారాల కింద డిగ్రీ, పీజీ చదువుల కోసం ఏటా రూ. 10వేల ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రిన్సిపాల్ చీన్యా, సీహెచ్ నాగేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.