Seethakka: ప్రతి విద్యాసంస్థలో ఈ పుస్తకం ఉండాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రతి విద్యా సంస్థలో భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
![Quiz competitions on Constitution topics to boost awareness, says Women and Child Welfare Minister Sitakka. Minister Sitakka emphasizes the importance of Constitution of India books in educational institutions. Every educational institution should have a book of Constitution of India](/sites/default/files/images/2024/01/24/seethakka-1706071165.jpg)
ఈ పుస్తకం పట్ల విద్యార్థులకు అవగాహన పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పుస్తకంలోని అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించాలని, దీంతో వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల అవగాహన పెరుగుతుందన్నారు.
చదవండి: Constitutional Values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా?
జనవరి 22న బంజారాహిల్స్ లోని బంజారా భవన్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల ప్రిన్స్పాల్స్, గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులతో సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ ఏడా ది జరిగే పదో తరగతి పరీక్షల్లో గిరిజన విద్యా సంస్థలన్నీ వంద శాతం ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్త మ ఫలితాలు సాధించిన సంస్థలకు బహుమతులందిస్తామని, ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. గిరిజన విద్యాసంస్థల్లో పాఠ్యాంశ బోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
![Constitution](/sites/default/files/inline-images/ConstitutionofIndiaBook.jpg)
Published date : 24 Jan 2024 10:09AM