Skip to main content

Education Officers: చనిపోయినా పది మూల్యాంకనానికి రావాల్సిందే...!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: క్యాన్సర్ తో బాధపడుతూ ఓ ఉపాధ్యాయురాలు 2023లో మరణించగా, పది మూల్యాంకనానికి హాజరుకాలే దంటూ ఆమెకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖా అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేయడం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.
Even if you die you have to come to the evaluation of tenh class

కాప్రా మండల పరిధిలోని జవహర్ నగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో గీత స్కూల్ అసిస్టెంట్ గా 2016-2023 మధ్య కాలంలో విధుల్లో ఉన్నారు. 2020లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగానూ ఎంపికయ్యారు. దీర్ఘకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె. 2023 మే నెలలో మరణించారు.

చదవండి: Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

ఒక విద్యా సంవత్సరం గడిచిపోయినా ఆ విషయం గుర్తించలేని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారులు ఆమెకు 10th Class జవాబు పత్రాల మూల్యాంకన విధులు కేటాయించారని, హాజరుకాలేదన్న కారణంతో ఏప్రిల్‌ 4న‌ షోకాజ్ నోటీసు జారీచేసి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Published date : 05 Apr 2024 05:31PM

Photo Stories