Skip to main content

ABVP: అధిక ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

సాక్షి, హైదరాబాద్‌: అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ జూలై 4న కలెక్టరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ తెలిపారు.
Action should be taken against schools charging high fees
అధిక ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని జూలై 3న ఒక ప్రకటనలో కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.5,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజు చెల్లించని విద్యార్థులకు అనేక కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి:

TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కార‌ణం ఇదే

MBBS Course Fees: ఇక‌నుంచి ఒక్కో కాలేజీలో ఒక్కో రేటు... తెలంగాణ‌లో భారీగా పెర‌గ‌నున్న ఫీజు... ఏ కాలేజీలో ఎంతంటే..!

High Court: ఆ ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే..

Published date : 04 Jul 2023 03:14PM

Photo Stories