Skip to main content

పాఠశాల విద్యా సాధన సర్వే పరీక్షకు 14,202 మంది హాజరు

పద్మనాభం : జిల్లాలో న‌వంబ‌ర్ 3న‌ 314 పాఠశాలల్లో నిర్వహించిన విద్యాసాధన సర్వే పరీక్షకు 14,934 మందికి గాను 14,202 మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా డీసీఈ బోర్డు కార్యదర్శి ఎం.వి.కృష్ణ కుమార్‌ తెలిపారు.
14202 people appeared for the school educational achievement survey test

522 మంది ఫీల్డ్‌ ఇన్విష్టిగేటర్ల సహాయంతో ఈ పరీక్ష నిర్వహించామన్నారు. మూడు, ఆరు,తొమ్మిది తరగతుల విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలతోపాటు సామాజిక, తరగతి, ఉపాధ్యాయ సంసిద్ధత, పాఠశాల నిర్వహణ వంటి అంశాలపై ఈ సర్వే జరిగిందన్నారు.

చదవండి: Department of Education: విద్యార్థులకు నైపుణ్య పరీక్షలు

జిల్లా విద్యా శాఖ అధికారిణి ఎల్‌.చంద్రకళ, ఉప విద్యాశాఖ అధికారి గౌరీశంకర్‌, డైట్‌ అధ్యాపకుడు జి.రవితో కలిసి సర్వే పరీక్షలను పరిశీలించామన్నారు.

Published date : 04 Nov 2023 03:24PM

Photo Stories