Skip to main content

Job mela: జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి

చింతపల్లి రూరల్‌: చింతపల్లి కేంద్రంగా ఈ నెల 6 తేదీన వైటీసీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ సూచించారు. ప్రేరణ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళా వివరాలను ఆయన వెల్లడించారు.
Chintapalli Job Fair under SP Tuhinsinha's Leadership  Opportunities at YTC Job Fair on 6th   Take advantage of the job mela   ASP Pratap Sivakishore at YTC Job Fair

టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఇంటర్‌ పాసై 30 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులన్నారు. అన్ని కులాలు వారు హాజరు కావచ్చాని తెలిపారు. అర్హత కలిగిన వారు ఆధార్‌కార్డు, టెన్త్‌ లేదా ఇంటర్‌ లేదా ఆపై విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ రమేష్‌, ఎస్‌ఐ అరుణ్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

చదవండి: Free Coaching: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌.. ఎవరు అర్హులంటే..

Published date : 03 Feb 2024 02:53PM

Photo Stories