Skip to main content

MPDOs: 38 మంది ఎంపీడీఓలకు పోస్టింగ్స్‌

కర్నూలు(అర్బన్‌): అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు బదిలీపై వచ్చిన 38 మంది ఎంపీడీఓలకు జిల్లాలో పోస్టింగ్స్‌ ఇచ్చినట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు.
Postings for 38 MPDOs

సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 40 మంది ఎంపీడీఓలను ఆయా జిల్లాలకు బదిలీ చేయగా, వారి స్థానంలో అనంతపురం నుంచి 23, వైఎస్సార్‌ జిల్లా నుంచి 15 మంది వచ్చారన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీరందరిని కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని మండలాలకు నియమించామన్నారు. వారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

చదవండి: Free Coaching: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌.. ఎవరు అర్హులంటే..

Published date : 03 Feb 2024 02:58PM

Photo Stories