సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఆమోదంపొంది, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న తెలంగాణ విద్యాశాఖ బిల్లులపై అనుమానాలను నివృత్తి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు.
గవర్నర్ ఆమోదించగానే ఖాళీల భర్తీ: మంత్రి సబిత
ఆమె డిసెంబర్ 22న బషీర్బాగ్లోని తన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కొంత కాలంగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే వర్సిటీల్లోని ఖాళీ లను భర్తీ చేస్తామని చెప్పారు.
బిల్లులను గవర్నర్ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియదని పేర్కొన్నారు. కరోనా కాలంలో తెలంగాణ లోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదని ఆమె వి మర్శించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజలపై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.