High Court: బీటెక్ అభ్యర్థులకు టీజీటీ అవకాశం ఇవ్వండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీజీటీ మ్యాథమేటిక్స్, సైన్స్ పోస్టులకు బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బీటెక్ అభ్యర్థులకు టీజీటీ అవకాశం ఇవ్వండి
బీఎస్సీ మ్యాథమేటిక్స్ అభ్యర్థులతో సమానంగా బీటెక్ వారిని చూడాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో ఇదే అంశంపై తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న ఇచ్చిన టీజీటీ మ్యాథమేటిక్స్ పోస్టుల నోటిఫికేషన్లో తమనూ పరిగణనలోకి తీసుకోవాలని పలువురు బీటెక్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ల తరఫున వాదనలు విన్న జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం గత తీర్పును అమలు చేయాలని గురుకుల విద్యాసంస్థల రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీచేసింది.