Skip to main content

Jobs: ఈ జాబ్‌ల‌ కోసం ఎదురుచూస్తున్న 4 లక్షల మందికి పైగా యువత

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తుండటం నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది.
Jobs
ఈ జాబ్‌ల‌ కోసం ఎదురుచూస్తున్న 4 లక్షల మందికి పైగా యువత

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ల్లో ఉత్తీర్ణులైన వారూ గంపెడాశలు పెట్టుకున్నారు. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువడుతుందని భావించారు. కానీ కల నెరవేరకపోవడంతో, నోటిఫికేషన్‌ వెలువడే సూచనలు లేకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఇప్పటివరకు మూడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు నిర్వహించింది. 2016, 2017ల్లో నిర్వహించిన టెట్‌లలో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. తాజాగా 2022 జూన్‌లో నిర్వహించిన టెట్‌లో మరో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. మూడు పరీక్షల్లో నాలుగు లక్షల మందికి పైగా అర్హత సాధించినా ఇప్పటివరకు ప్రయోజనం లేకుండా పోయింది. ఏడేళ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయని టెట్‌ ఉత్తీర్ణులు వాపోతున్నారు. 

చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

పదోన్నతులకు, నియామకాలకు ముడి 

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్‌జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్‌ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. కానీ ఈ ప్రక్రియ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావిడి చేసినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వివాదాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేయడం లేదనే విమర్శలున్నాయి.  కోర్టు వివాదాలకు దారి తీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్ళడం లేదనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.    

చదవండి: TS Gurukul Recruitment 2023 : 9231 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి 
బదిలీలు, ప్రమోషన్స్‌ పేరిట కాలయాపన చేయడం వల్ల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో 4 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మేమంతా టీచర్‌ పోస్టులు వస్తాయని ఉన్న ఉద్యోగాలు మానేసి, పోటీ పరీక్షకు రూ.వేలు ఖర్చు పెట్టాం. అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం, టీఆర్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక శాఖకు అనుమతివ్వాలి.  
– రావుల రామ్మోహన్‌ రెడ్డి (రాష్ట్ర డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) 

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చాలి 
రాష్ట్రంలో 60 శాతానికి పైగా గెజిటెడ్‌ హెచ్‌ఎంలు, వేలాది స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యాశాఖ ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాలయాపన చేయకుండా తక్షణమే బదిలీలు, పదోన్నతుల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి.  
– ఎం చెన్నయ్య (పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు) 

టెట్‌ ఉత్తీర్ణుల వివరాలు ఇలా.. 

2016లో..

పేపర్‌

అభ్యర్థులు

ఉత్తీర్ణులు

శాతం

పేపర్‌–1

88,661

48,278

54.45

పేపర్‌–2

2,51,906

63,079

25.04

2017లో..

పేపర్‌–1

98,848

56,708

57.37

పేపర్‌–2 (సైన్స్‌)

1,11,018

20,233

18.22

పేపర్‌–2(సోషల్‌)

1,19,914               

24,732

20.62

2022లో..

పేపర్‌–1

3,18,506

1,01,922

32.68

పేపర్‌–2

2,51,070

1,04,078

49.64

Published date : 19 Apr 2023 01:40PM

Photo Stories