రాయచోటిటౌన్ : హోం వర్క్ సరిగా చేయలేదని ఓ విద్యార్థిని చితకబాదిన సంఘటన రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జూలై 26న చోటు చేసుకొంది.
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
రాయచోటి పట్టణంలోని వేదవ్యాస పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఉస్మాన్ ఖాన్ హోం వర్క్ సరిగా రాయలేదని ఉపాధ్యాయుడు కర్రతో వీపుపై వాతలు వచ్చేలా కొట్టాడు. విషయం తెలుసుకున్ని విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాయచోటి ఎంఈఓ ఈశ్వర నాయక్ను డీఈఓ శ్రీరాం పురుషోత్తం ఆదేశించారు.