Inspection: జామడ బాలిక పాఠశాలలో ఆకస్మి క తనిఖీ..!
Sakshi Education
విద్యార్థుల చదువును, వారికి అందే సదుపాయాలను పరిశీలించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు..
![Kumra Ishwaribai, State Women's Commission member, giving advice on disciplined study Member of State Women Commission Eshwari Bai speaking to students](/sites/default/files/images/2024/02/24/eshwari-bhai-1708776889.jpg)
ఆదిలాబాద్: క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి సూచించారు. శుక్రవారం జీసీడీవో ఛాయతో కలిసి మండలంలోని జామడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలోకి వెళ్లి భోజనం నాణ్యతను పరిశీలించారు.J
TASK Program: విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు రెండు రోజుల కార్యక్రమం..
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కుమురంభీం జీసీడీవో శకుంతల, ప్రధానోపాధ్యాయుడు చౌహాన్ నెహ్రూ తదితరులున్నారు.
Published date : 24 Feb 2024 05:44PM