Skip to main content

Students at G20 Competitions: దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించే జి20 పోటీల్లో ఈ విద్యార్థులు ఎంపిక‌

ఇటీవ‌లె నిర్వ‌హించిన జి20 పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ పాఠ‌శాల విద్యార్ధులు పాల్గొన‌గా, అందులో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారిని ఎంపిక చేశారు. ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా జ‌రిగే పోటీల్లో పాల్గొంటారు.
Students selected for G20 competitions in national wide
Students selected for G20 competitions in national wide

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో గతనెల 30న నిర్వహించిన జి20 పోటీల్లో మండలంలోని పి.యర్రగొండ ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచినట్టు ప్రిన్సిపాల్‌ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. వారికి ప్రశంశాపత్రాలు, మొమెంటోలు అక్కడ అందజేశారన్నారు.

Tabs for Students: సాంకేతిక‌త‌ను పెంచేందుకు విద్యార్థుల‌కు ట్యాబ్ ల పంపిణీ

విద్యార్థినులు జి.సత్యగౌరి, కె.మల్లేశ్వరిదేవి, పి.ప్రియాంకదేవి, కె.స్వర్ణలత, పి.లోకేశ్వరి దివ్యకళ వచ్చేనెలలో దేశవ్యాప్తంగా నిర్వహించే జి20 కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను ఆయనతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.

Published date : 05 Oct 2023 03:19PM

Photo Stories