Students at G20 Competitions: దేశవ్యాప్తంగా నిర్వహించే జి20 పోటీల్లో ఈ విద్యార్థులు ఎంపిక
Sakshi Education
ఇటీవలె నిర్వహించిన జి20 పోటీల్లో మహబూబ్నగర్ జిల్లాలోని ఓ పాఠశాల విద్యార్ధులు పాల్గొనగా, అందులో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు. ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా జరిగే పోటీల్లో పాల్గొంటారు.
Students selected for G20 competitions in national wide
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో గతనెల 30న నిర్వహించిన జి20 పోటీల్లో మండలంలోని పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచినట్టు ప్రిన్సిపాల్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. వారికి ప్రశంశాపత్రాలు, మొమెంటోలు అక్కడ అందజేశారన్నారు.
విద్యార్థినులు జి.సత్యగౌరి, కె.మల్లేశ్వరిదేవి, పి.ప్రియాంకదేవి, కె.స్వర్ణలత, పి.లోకేశ్వరి దివ్యకళ వచ్చేనెలలో దేశవ్యాప్తంగా నిర్వహించే జి20 కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను ఆయనతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.