మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 2023–24 సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ ద్వారా తొమ్మిది, పదకొండు తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించే తేదీని ఈనెల 7 వరకు పొడిగించామన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా గడువు లోగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.