Skip to main content

Teachers Award: ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

invitation of applications for teachers award

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చేనెల ఐదో తేదీన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదానం చేసే అవార్డులకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం గురువారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని పాఠశాలల నుంచి పది మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, ఐదుగురు స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమానమైన ఉపాధ్యాయులు ప్రతిపాదనలను పంపాలనాన్నారు. జిల్లా పరిధిలో 30 మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులను, 20 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, తత్సమానమైన ఉపాధ్యాయులు, 10 మంది ప్రధానోపాధ్యాయుల ప్రతిపాదనలను మాత్రమే నిర్ణీత నమూనాలో ఈనెల 28వ తేదీలోగా మండల కమిటీ, డివిజనల్‌ కమిటీలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఉపాధ్యాయులు దరఖాస్తులను మండల కమిటీకి ఈనెల 26వ లోపు నిర్ణీత నమూనాలో సంబంధిత తనిఖీ అధికారులకు సమర్పించాలన్నారు. దరఖాస్తు నమూనా జిల్లావిద్యాశాఖాధికారి వెబ్‌సైట్‌ డీఈవోఈజీ.ఓఆర్‌జీలో అందుబాటులో ఉందన్నారు.

చదవండి: Teacher Jobs: టీచర్‌ పోస్టులు గల్లంతు..!

Published date : 25 Aug 2023 02:57PM

Photo Stories