Skip to main content

Illegal Transfers of Teachers: తెలంగాణ లో ఉపాధ్యాయ అక్రమ బదిలీలు

సాక్షి ఎడ్యుకేష‌న్ : రంగారెడ్డి జిల్లాలోకి వచ్చే అక్రమ ఉపాధ్యాయ బదిలీలను ఆపాలని పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.
Illegal Transfers of Teachers in Telangana
Illegal Transfers of Teachers in Telangana

పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని పర్వేద, మహారాజ్‌పేట్‌, టంగుటూరు, ప్రొద్దుటూరు, జనవాడ, కొత్తపల్లి శంకర్‌పల్లి పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు ఉపాధ్యాయులు అక్రమంగా బదిలీపై వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీఆర్సీని వెంటనే చేయాలని, మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు రాజశేఖర్‌, గౌరవ అధ్యక్షుడు బాల్‌రాజ్‌, రాష్ట్ర బాధ్యులు రవికాంత్‌రెడ్డి, శ్రీధర్‌, మాణిక్యం, మల్లేశం, మొయినాబాద్‌ మండల అధ్యక్షుడు బందయ్య పాల్గొన్నారు.

Published date : 22 Aug 2023 01:11PM

Photo Stories