Gurukul School Students: విద్యార్థుల ఆందోళన
Sakshi Education
![gurukul school students protested on principal](/sites/default/files/images/2023/07/27/boys-school-students-1690451421.jpg)
బెల్లంపల్లి: బెల్లంపల్లి రాష్ట్ర ప్రభుత్వ బాలుర గురుకుల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వేధిస్తున్నాడని, మెనూ సరిగా పాటించడం లేదని ఆరోపిస్తూ బెల్లంపల్లి–గురిజాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. జోరువానలోనూ ఆందోళన కొనసాగిస్తూ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మండల విద్యాశాఖ అధికారి మహేశ్వర్రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాళ్లగురిజాల ఎస్సై నరేష్ విద్యార్థుల సమస్య తెలుసుకుని పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ సెలవుపై వెళ్లారు. దీంతో సీనియర్ ఉపాధ్యాయుడికి ఇన్చార్జి ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించారు.
Published date : 27 Jul 2023 03:20PM