Skip to main content

Essay Writing for students: మండ‌ల స్థాయిలో వ్యాస‌ర‌చ‌న పోటీలు

విద్యార్థుల‌కు నిర్వహించిన వ్యాస‌ర‌చ‌న పోటీల్లో ఎస్ఐ శ్రీ‌నివాస్ త‌న మాటల్లో ప‌లు అంశాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న‌ను అందించి, పోటీల‌ను నిర్వ‌హించినందుకు అధికారుల‌ను అభినందించి విద్యార్థుల‌ను ప్రోత్స‌హించారు.
Students receiving encouragement from SI Srinivas,Essay competitions organized at Local Government High School, Students participating in essay competition
Essay competitions organized at Local Government High School

సాక్షి ఎడ్యుకేష‌న్: మండల స్థాయి వ్యాసరచన పోటీలు ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీమత్స్య మాడుగులమ్మ ఆలయ ఆధ్వర్యంలో జరిగాయి. ఎస్‌ఐ శ్రీనివాస్‌ వ్యాసరచన పోటీలను ప్రారంభించి అభ్యర్థులకు తగిన సూచనలు ఇచ్చారు. సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాల వల్ల అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి పంటలకు దూరంగా ఉండాలని ఆయన తెలియజేశారు. సమాజంలో జరుగుతున్న వివిధ రకాలు అంశాలపై అవగాహన ఉండాలన్నారు. యువతలో సామాజిక బాధ్యత కోసం మత్స్యమాడుగులమ్మ యూత్‌ వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేయటంపై ఆయన అభినందించారు.

Andhra University: ఏయూలో ప్రారంభం కానున్న త‌ర‌గతులు

వ్యాసరచన పోటీలకు 156మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 20న నగదు, షీల్డ్‌ బహుమతులు అందజేస్తామని నిర్వహాకులు తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు మత్స్యరాస విజయకుమారి, డాక్టర్‌ ఎం.సౌజన్యదేవి, లక్ష్మణ్‌, ఎం.శ్రీనివాసరాజు, సొలభం సత్యనారాయణ ఆర్థిక సహాయం చేశారు. మత్స్యమాడుగులమ్మ యూత్‌ నాయకులు, నిర్వాహకులు ప్రసాద్‌, జయసింహరాజు, రామకృష్ణంరాజు, ప్రదీప్‌చంద్‌, గోపాల్‌రాజు, అఖిల్‌,వలసయ్య, శరత్‌కుమార్‌, చిన్నరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Published date : 19 Sep 2023 12:48PM

Photo Stories