Skip to main content

RRB Latest Jobs Notification 2025 : రైల్వే శాఖలో 9,900 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల కాలం ఇండియ‌న్ రైల్వే భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తుంది. తాజాగా ఇండియ‌న్ రైల్వే నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ చెప్పింది.
rrb 9900 loco pilot jobs notification 2025

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా 9,900 పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. ఆర్‌ఆర్‌బీ జోన్ల వారీగా ఖాళీలను.. అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. 

అర్హ‌త‌లు ఇవే...
మెట్రిక్యులేషన్‌తో.. పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వ‌య‌స్సు : 
జ‌న‌వ‌రి 7వ తేదీ నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-6-8 సంవత్సరాలు; రైల్వేలో గ్రూప్-సి, గ్రూప్-డి విభాగంలో పనిచేస్తున్నవారికి 40-43-45 సంవత్సరాలు; వితంతువులు, ఒంటరి మహిళలకు 35-38-40 సంవత్సరాలు; 25 సంవత్సరాలలోపు ఉండి అప్రెంటిస్ పూర్తిచేసినవారికి 35-38-40 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

☛➤ Rajiv Yuva Vikasam Scheme Eligibility : రాజీవ్ యువ వికాసం అర్హ‌త‌లు .. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ.. గైడ్ లైన్స్ ఇవే..!

ఎంపిక విధానం ఇలా..
రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

జీతం :
ఈ ఉద్యోగంకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ :
దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించ‌నున్నారు. ఆన్‌లైన్ విధానం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : 
ద‌ర‌ఖాస్తు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. 

ఎంపిక విధానం : 
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం :
మొత్తం 75 మార్కులకు స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ⅓ మార్కులు కోత విదిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

స్టేజ్-2 పరీక్ష :
మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పేపర-2 పరీక్ష సమయం 60 నిమిషాలు.

Published date : 28 Mar 2025 07:11PM

Photo Stories