Skip to main content

AP Edcet-2021: ఫలితాలు విడుదల..అందుబాటులో ఉన్న సీట్లు ఇవే..

సాక్షి, విశాఖపట్నం: ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు అక్టోబ‌ర్ 12వ తేదీన‌ విడుదల చేశారు.

ఈ ఫ‌లితాల‌ను విశాఖపట్నంలో ఏపీ ఎడ్ సెట్ కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.

కౌన్సెలింగ్ తేదీలను..
ఎడ్‌సెట్‌ ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుట్లు కన్వీనర్‌ విశ్వేశ్వర్‌రావు వెల్లడించారు. గతేడాది డాటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.  కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి పేర్కొంది.

Published date : 12 Oct 2021 06:51PM

Photo Stories