Skip to main content

సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణకు సెప్టెంబర్‌ 27న పరీక్ష

సాక్షి, అమరావతి: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ కోసం ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల అభ్యర్థుల ఎంపికకు సెప్టెంబర్‌ 27న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు ఉసురుపాటి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు.
ఏపీలో 150 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేలా ప్రీ క్వాలిఫెయింగ్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలు jnanabhumi.ap.gov.in, apstdc.apcfss.in లో పొందుపరిచినట్లు తెలిపారు.
Published date : 24 Aug 2021 03:25PM

Photo Stories