జీతాలివ్వని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు: ఏపీ పాఠశాల విద్యాశాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: తమకు కొద్దినెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని వేలాది మంది ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది కొంతకాలంగా విద్యాశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు.
![](/sites/default/files/images/2020/09/04/APLogo.jpg)
ఉద్యోగాలు లేక పలువురు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబ పోషణ కోసం రోడ్లపై కూరగాయలు, చెప్పులు అమ్ముకుంటూ, నిర్మాణ కూలీలుగా మారుతూ ఇతర చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ఈ అంశాలు పాఠశాల విద్యాశాఖ దృష్టికి రావడంతో కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం అన్ని జిల్లాల అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోని సిబ్బందికి జీతాలు ఇవ్వని ఆయా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Published date : 04 Sep 2020 02:15PM