Skip to main content

‘అమ్మఒడి’కి వలంటీర్లూ అర్హులే: మంత్రి కొడాలి నాని

గుడివాడ: రాష్ట్రంలో చేపట్టిన విద్యా విప్లవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన అమ్మఒడి పథకానికి గ్రామ, వార్డు వలంటీర్లు కూడా అర్హులేనని మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు.
జనవరి 25 (శనివారం)న గుడివాడలోని ఆయన స్వగృహంలో మంత్రిని వలంటీర్లు కలిశారు. అమ్మఒడి పథకం నగదు తమకు మంజూరు కాలేదని, ఐడీ నంబర్లు బ్లాక్ అయినట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తోందని వలంటీర్లు చెప్పారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కొంతమంది తమకు రావాల్సిన జీతాల గురించి ప్రస్తావించగా.. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Published date : 27 Jan 2020 01:07PM

Photo Stories