Women Job Offer: 27న మహిళలకు జాబ్ మేళా..
అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న మహిళా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకకు ఆ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాస్, డిగ్రీ పాస్/ ఫెయిల్ అయి 18 నుంచి 26 సంవత్సరాల్లోపు వయసున్న నిరుద్యోగ మహిళలు అర్హులు. అభ్యర్థులు 43 కిలోల నుంచి 65 కేజీల బరువు ఉండాలి. 145 సెంటీమీటర్ల పైబడి ఎత్తు ఉండాలి.
Tenth Board Exams: టెన్త్ పరీక్షలకు పకడ్బందీగా సన్నద్ధం..
ఉద్యోగానికి ఎంపికైన వారు కర్ణాటకలోని కోలారు జిల్లా నర్సాపుర పారిశ్రామిక వాడలోని ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్లు, టెక్నికల్ ఆపరేటర్లుగా పనిచేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు వేతనంగా రూ.18,175 రూ. 1,000 అటెండెన్స్ బోనస్ చెల్లించడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి ఉన్న మహిళా నిరుద్యోగులు తమ బయోడేటాతో ఈ నెల 27న జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు 95138 22234లో సంప్రదించవచ్చు.