Skip to main content

JEE Mains 2023: సిలబస్‌ ఖరారు.. ఏ స‌‌బ్జెక్ట్ నుంచి ఎన్ని టాపిక్ లో తెలుసుకోండి..

సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. Indian Institutes of Technology (IIT), National Institute of Technology (NIT), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే Joint Entrance Examination (JEE) MAIN 2023 సిలబస్‌ను National Testing Agency (NTA) డిసెంబర్‌ 21న విడుదల చేసింది.
JEE Mains 2023
జేఈఈ మెయిన్ 2023 సిలబస్‌ ఖరారు.. ఏ స‌‌బ్జెక్ట్ నుంచి ఎన్ని టాపిక్ లో తెలుసుకోండి..

దీని ప్రకారం.. మ్యాథమెటిక్స్‌లో 16 టాపిక్‌లు, ఫిజిక్స్‌ సెక్షన్‌–ఏలో 20 టాపిక్స్, సెక్షన్‌–బిలో ప్రయోగ నైపుణ్యాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇక కెమిస్ట్రీలోని ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీల్లో 10 చొప్పున టాపిక్స్‌ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ భాషలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ముందుగానే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది.

చదవండి: NTA: ఇంటర్‌లో ఇంత శాతం మార్కులు సాధిస్తేనే జేఈఈ మెయిన్స్‌కు..

జేఈఈ మెయిన్‌లో భాగంగా బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు పేపర్‌–1, బీఆర్క్‌ కోసం పేపర్‌–2ఏ, బీప్లానింగ్‌కు పేపర్‌–2బీని నిర్వహిస్తారు. పేపర్‌–1లో మూడు సెక్షన్ల కింద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రశ్నలుంటాయి. కంప్యూటర్‌ ఆధారితంగా పరీక్షలు జరుగుతాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్‌ ఆన్సర్‌కు 1 మార్కు కోత ఉంటుంది. పేపర్‌–1లో మూడు సెక్షన్లలో 300 మార్కులకు 90 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలుంటాయి. పేపర్‌–2ఏలో 400 మార్కులకు 82 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–2బీలో 400 మార్కులకు 105 ప్రశ్నలుంటాయి. 

చదవండి: JEE Advanced 2023: కొత్త సిలబస్‌తో

జనవరి, ఏప్రిల్‌లోరెండు సెషన్లుగా పరీక్షలు..

కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షలను జనవరి, ఏప్రిల్‌లలో రెండు సెషన్లుగా నిర్వహించేలా ఎన్‌టీఏ షెడ్యూల్‌ విడుదల చేసింది. తొలి సెషన్‌ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనవరి సెషన్‌ పరీక్షల తేదీల్లోనే పలు ఇంటరీ్మడియెట్‌ బోర్డులు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నాయి.

చదవండి: EAMCET 2023: జనవరిలో ఎంసెట్‌ నోటిఫికేషన్‌!.. విద్యార్హతల్లో మార్పులు?

ఒకే తేదీల్లో ఈ రెండు పరీక్షలు రావడంవల్ల తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా జనవరి సెషన్‌కు సన్నద్ధం కావడానికి తక్కువ సమయం ఇచ్చారని, ఈ తేదీలను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో రద్దు చేసిన ఇంటరీ్మడియెట్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను పునరుద్ధరించడం వల్ల కూడా ఎక్కువ మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సడలించాలని కోరుతున్నారు. 

Also Read: JEE (MAIN & ADV.) - MODEL PAPERS | GUIDANCE | PREVIOUS PAPERS (JEE MAIN) | PREVIOUS PAPERS (JEE ADV.) | SYLLABUS | SYLLABUS (JEE ADV.) | NEWS | VIDEOS

Published date : 22 Dec 2022 02:56PM

Photo Stories