JEE Main: జేఈఈ మెయిన్ కి 70 మంది విద్యార్థులు హాజరు కాగా, 37 మందికి ఉత్తమ స్కోర్
Sakshi Education
జేఈఈ మెయిన్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.
జేఈఈ మెయిన్ కి 70 మంది విద్యార్థులు హాజరు కాగా, 37 మందికి ఉత్తమ స్కోర్
ఈ పరీక్షకు బీసీ గురుకుల సొసైటీ నుంచి 70 మంది విద్యార్థులు హాజరు కాగా, 37 మందికి ఉత్తమ స్కోర్ వచి్చనట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. వీరిలో అత్యధికంగా లలిత్ ఆదిత్యకు 97.06 స్కోర్ వచ్చిందన్నారు. విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందనలు తెలిపారు.