JEE Advanced బ్రేకింగ్: జేఈఈ అడ్వాన్స్ డ్ గడువు ఒకరోజు పెంపు
Sakshi Education
జేఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీని ఐఐటీ–ఖరగ్పూర్ ఒక రోజు పొడిగించింది.
జేఈఈ అడ్వాన్స్ డ్ గడువు ఒకరోజు పెంపు
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 20 రాత్రి 11:59 గంటలతో దరఖాస్తు గడువు పూర్తికావాల్సి ఉండగా, అభ్యర్థులకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువును పెంచుతూ అవకాశాన్ని కల్పించారు. దీంతో జేఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్ష కోసం సెప్టెంబర్ 21 రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు సమయంలో పరీక్ష రుసుము రూ.2,800 చెల్లించేందుకు మాత్రం చివరి తేదీని పొడిగించలేదు. దీని ప్రకారం అభ్యర్థులు పరీక్ష ఫీజును సెపె్టంబర్ 21 న రాత్రి 11:59 గంటలలోపు మాత్రమే చెల్లించాలి.