Skip to main content

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ - ఏపీ, `సాక్షి` వెబినార్‌కు అపూర్వ స్పంద‌న‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు దీటుగా అందుబాటులో ఉన్న కెరీర్‌ అవకాశాలపై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ - ఏపీ, ‘సాక్షి’సంయుక్తంగా జూలై 27వ తేదీ సాయంత్రం 4:00 నుంచి 5:30 వరకు వెబినార్‌ నిర్వహించారు.
ఈ వెబినార్‌లో వివిధ సబ్జెక్ట్‌ల‌ నిపుణులు పాల్గొన్నారు. ఇంట‌ర్ త‌ర్వాత‌ వివిధ కోర్సుపై అవగాహన కల్పించారు. ఇంటర్‌ తర్వాత ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? వాటితో ఎలాంటి కెరీర్‌ అవకాశాలు లభించనున్నాయి? కోర్సు ఎంపిక‌లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? ఏఏ కోర్సు పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగాలు వ‌స్తాయి..? ఇలాంటి ఎన్నో సందేహాలను ఈ వెబినార్‌ ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారు. వెబినార్‌లో ప్రముఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సత్య ప్రమోద్‌ జమ్మీ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ ఉమా మహేశ్వర్‌ ఆరేపల్లి (సివిల్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ సోమేశ్‌ వినాయక్‌ తివారీ (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ ఓం జీ పాండే (ఎల్రక్టానిక్స్‌– కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) పాల్గొన్నారు. ఈ పూర్తి వెబ్‌నార్‌ను https://www.youtube.com/embed/db3Vh5L-u3o యూట్యూబ్‌ లింక్‌ ద్వారా చూడండి.

Published date : 27 Jul 2021 06:50PM

Photo Stories