Skip to main content

APPSC Group 2 Mains 2024 Postponed : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా.. మ‌ళ్లీ ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వ‌హించే గ్రూప్‌-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ను వాయిదా వేశారు. జులై 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ఏపీపీఎస్సీ ప్ర‌క‌టించింది. ఈ గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్ష తేదీల‌ను త్వరలోనే వెల్లడిస్తామని కమిషన్‌ పేర్కొంది.
APPSC Group 2 Mains 2024 Postponed

ఈ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 

APPSC Group-2 మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–1లో సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్‌–2 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.

ఏపీపీఎస్సీ డిసెంబర్‌ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులు నోటిఫికేషన్‌కు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి పెరిగాయి. పెరిగిన పోస్టుల ఆధారంగా మెయిన్స్‌కు మొత్తం 92,250 మందిని ఎంపిక చేశారు.

Published date : 03 Jul 2024 09:12PM

Photo Stories