Skip to main content

జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం

ప్ర‌తి ఏడాది జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటారు.
యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగా డే ముఖ్యోద్దేశం. యోగా అనే పదం ‘సంస్కృతం’ నుంచి వచ్చింది. ‘యుజ’ అనే పదం నుంచి వచ్చింది. ‘యుజ’ అంటే దేనినైనా ఏకం చేయడం లేదా చేర్చ‌డం అని అర్థం. అంటే శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా. ఈ ఏడాది జూన్ 21, 2020న మ‌నం 6వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌ వాన్నిజ‌రుపుకుంటున్నాం.

చ‌రిత్ర‌:
జూన్ 21నే యోగాడేను జరుపుకోవడానికి గ‌ల‌కారణమేమిటంటే? జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. అంటే డే (ప‌గ‌టి) సమయం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.

2014లో మోదీ ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించడంతో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు. జూన్ 21, 2015న ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. భారత్‌లో ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆరోజు ప్రధాని మోదీతో పాటు వేలాదిమంది యోగా చేశారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది ఆరోజు మోదీతో పాటు యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు.

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2020 థీమ్‌:
“యోగా ఎట్ హోమ్ అండ్ యోగా ఎట్ ఫ్యామిలీ”
ఈ ఏడాది కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే మ‌నం వ్యాధినోరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌నం ఇంట్లోనే ఉంటూ మ‌న కుటుంబంతో క‌లిసి ప్ర‌తి రోజు త‌ప్ప‌కుండా యోగా చేసి ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌దాం. ఈ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో యోగా ఒక్క‌టే స‌రైనా చిక‌త్సా విధానంగా చెప్ప‌వచ్చు.
Published date : 13 Jun 2020 06:46PM

Photo Stories