Anti Terrorism Day: జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఏప్పుడు జరుపుకుంటారు?
Sakshi Education
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి రోజు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుప బడుతుంది.
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్ ఎన్నికల ప్రచారంలో ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు. తీవ్రవాద చర్యలు రూపుమాపి, దేశ ప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.