Skip to main content

Bal Shakti Puraskar: ఇద్దరు తెలుగు బాలలకు ‘బాల పురస్కారాలు’

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇద్దరు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ‌ బాల పురస్కారాలు ప్రదానం చేశారు.
Pradhan Manthri Rashtriya Bal Puraskar
ఇద్దరు తెలుగు బాలలకు ‘బాల పురస్కారాలు’

జనవరి 24న వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో 2021–2022కి గాను 29 మంది రాష్ట్రీయ‌ బాల పురస్కార్‌ గ్రహీతలతో ప్రధాని మోదీ మాట్లాడారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా సరి్టఫికెట్లు అందించారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన తేలుకుంట విరాట్‌ చంద్రతోపాటు ఏపీకి చెందిన గురుగు హిమప్రియ ఈ పురస్కారాలను అందుకున్నారు. 2021 మార్చిలో విరాట్‌ ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కిలీ మంజారో పర్వతాన్ని అధిరోహించాడు. కాగా, జమ్మూలోని సుంజువన్ మిలిటరీ క్యాంపుపై టెర్రరిస్టుల దాడిలో చాకచక్యంగా వ్యవహరించి ధైర్యసాహసాలు ప్రదర్శించిన గురుగు హిమప్రియకూ ఈ పురస్కారం అందించారు. వీళ్లు జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు. 

చదవండి: 

 

ఒకే ఒక రోజు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ది.. ఎవరో తెలుసా.?

Oscar: బరిలో వీక్లీ న్యూస్‌పేపర్‌ జర్నలిస్టులు

Janakiammal: దర్జీగా బతికిన గణిత మేధావి భార్య

Published date : 25 Jan 2022 05:39PM

Photo Stories