Skip to main content

Latest Exam: కట్టుదిట్టంగా FA 2 పరీక్షలు

Latest Exam
Latest Exam

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా తొలిరోజు మంగళవారం ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 2 పరీ క్షలు కట్టుదిట్టంగా నిర్వహించినట్లు జిల్లా ఉ మ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి హేమారెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పరీక్షలు జరిగాయని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అంత ర్జాతీయ స్థాయిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేసిన షెడ్యూల్‌ మేరకు ఫా ర్మేటివ్‌ పరీక్షలు ఒకటి నుంచి పదో తరగతి వ రకు జరుగుతాయన్నారు. ఈ నెల 6 వ తేదీ వ రకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏ ర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 94,901 మంది, ఆరు నుంచి పదో తరగతి వరకు 1,11,750 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. తొలిరోజు పరీక్షను పలు పాఠశాలల్లో తనిఖీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Published date : 04 Oct 2023 07:47PM

Photo Stories