డిప్లొమా కోర్సులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ CIPET (Central Institute Of Plastics Engineering & Technology) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ సీపెట్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ సెంటర్ జేడీ సీహెచ్ శేఖర్ ఆగస్టు 17న తెలిపారు.
డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
మూడేళ్ల కాల పరిమితితో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి డీపీటీ, డీపీఎంటీ కోర్సులు, రెండేళ్ల వ్యవధితో బీఎస్సీ ఉత్తీర్ణులైన వారికి ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీ డిప్లొమా ఇన్ పీపీటీ) కోర్సులో అడ్మిషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఆగస్ట్ 22 లోగా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తుండగా, విద్యార్థిని విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ సదుపాయాన్ని సీపెట్ అందిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 7893586494 నంబర్ను సంప్రదించాలని కోరారు.