Skip to main content

మే 4 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీల దరఖాస్తుకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మరో 4 రోజులు గడువిచ్చింది.
ట్రిపుల్‌ వన్‌ (111) జీవో పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీల భవన నిర్మాణాల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఏఐసీటీఈకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఏఐసీటీఈ పెంచింది. యాజమాన్యాలు దరఖాస్తులను ఈనెల 4 వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని పేర్కొంది. ఈమేరకు కాలేజీలకు మెయిల్‌ పంపించింది. గతంలో ఇచి్చన గడువులో ఆయా కాలేజీలు దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టినా, భవన నిర్మాణాల రెగ్యులరైజేషన్‌ సమస్య ఉన్నందున ఆగిపోయాయి.
Published date : 01 May 2021 05:36PM

Photo Stories