‘ESCI’ సందర్శనకు రాష్ట్రపతి అంగీకారం
Sakshi Education
రాయదుర్గం: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎస్కీ) సందర్శనకు అంగీకరించి నట్టు సంస్థ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు తెలిపారు.
ఆయన మే 14న విలేకరులతో మాట్లాడుతూ మే 13న న్యూఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఆహ్వానించినట్టు తెలిపారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.
చదవండి: Engineering Colleges: ర్యాంకర్లూ కోసం... ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల వెతుకులాట..
ఈ సంద ర్భంగా ఎస్కీ పనితీరు, నిర్వహించే కోర్సులు, శిక్షణలపై రాష్ట్రపతికి వివరించినట్లు పేర్కొ న్నారు. జూలై చివరివారం లేదా ఆగస్టు మూడో వారంలో రావడానికి రాష్ట్రపతి సమ్మతించినట్లు తెలిపారు.
Published date : 15 May 2024 11:26AM