Skip to main content

ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో మూడు కొత్త కోర్సులు

రాయదుర్గం(హైదరాబాద్‌): ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో మూడు కొత్త పీజీ డిప్లొమా కోర్సులకు శ్రీకారం చుట్టినట్లు సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రామేశ్వరరావు వెల్లడించారు.
గచ్చి»బౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం నుంచి శనివారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, జనరల్‌ మేనేజ్‌మెంట్, ఇండ్రస్టియల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో రెండేళ్ల కాలవ్యవధితో పీజీ డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఈ కోర్సులను జూలై నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రూప్‌ డిస్కషన్స్‌, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన చెప్పారు.
Published date : 24 May 2021 02:35PM

Photo Stories