ఏపీ ఈసెట్– 2021 నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 19న పరీక్ష..
Sakshi Education
అనంతపురం విద్య: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 (ఏపీ ఈసెట్) నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సి.శశిధర్ తెలిపారు.
![](/sites/default/files/images/2021/07/09/APSCHE.jpg)
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ రెండో సంవత్సరం (లేటరల్ ఎంట్రీ)లో అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్ దరఖాస్తులు జూలై 12 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయన్నారు. సెప్టెంబర్ 19న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు www.sche.ap.gov.in/ecet వెబ్సైట్లో చూడాలని సూచించారు.
Published date : 09 Jul 2021 03:45PM