Skip to main content

ఏపీ ఈసెట్‌– 2021 నోటిఫికేషన్‌ విడుదల.. సెప్టెంబర్‌ 19న పరీక్ష..

అనంతపురం విద్య: ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2021 (ఏపీ ఈసెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ తెలిపారు.
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌ రెండో సంవత్సరం (లేటరల్‌ ఎంట్రీ)లో అడ్మిషన్‌ కల్పించేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌ దరఖాస్తులు జూలై 12 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. సెప్టెంబర్‌ 19న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు www.sche.ap.gov.in/ecet  వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
Published date : 09 Jul 2021 03:45PM

Photo Stories