Skip to main content

CUETలో ఖమ్మం విద్యార్థిని ప్రతిభ

ఖమ్మంసహకారనగర్: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూ ఈటీ)లో ఖమ్మానికి చెం దిన విద్యార్థిని ప్రతిభ కనబర్చింది.
CUET
వున్నవ రిషిక

జిల్లా కేంద్రంలోని బుర్హాన్ పురానికి చెందిన వున్నవ రిషిక కేంద్రియ విద్యాలయంలో పదో తరగతి వరకు చదవగా, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో పూర్తి చేసింది. ఈ క్రమంలో సీయూఈటీ రాసిన ఆమె 541 మార్కులు సాధించగా.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (షిల్లాంగ్ క్యాంపస్)లోని అన్ని విభాగాల్లో సీటు సాధిం చింది.

చదవండి: CUET: ఆ ఐదు యూనివ‌ర్సిటీలు హాట్ ఫేవ‌రెట్‌... సీయూఈటీకి పెరుగుతున్న క్రేజ్‌

తెలంగాణ నుంచి అన్ని విభాగాల్లో సీటు సాధించిన ఏకైక విద్యార్థినిగా రిషిక గుర్తింపు సాధించింది. ఆమె ఈ విద్యా సంవ త్సరం(2023-24) బీఏ హానర్స్ రీసెర్చ్ ఇం గ్లిష్ కోర్సు అభ్యసించాలని నిర్ణయించుకుంది. కాగా, రిషిక తండ్రి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడైన కిరణకుమార్ కరోనా సమయంలో కన్నుమూ శాడు. ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం సాధించ డమే తన లక్ష్యంగా రిషిక చెబుతోంది.

చదవండి: UGC: ఇకపై ఇన్ని షిఫ్టుల్లో సీయూఈటీ

Published date : 16 Aug 2023 05:20PM

Photo Stories