సాక్షి, అమరావతి: బీఈడీ తదితర ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్–2022 వెబ్ కౌన్సెలింగ్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది.
ఎడ్సెట్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు జనవరి 24న విడుదల చేశారు. జనవరి 25 నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
28న ఆప్షన్లలో సవరణకు అవకాశమిచ్చి, 30న సీట్లు కేటాయిస్తామన్నారు. 31 నుంచి ఫిబ్రవరి 3 లోపు కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.