సాక్షి ఎడ్యుకేషన్: Engineering రెండో ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ECET ఉత్తీర్ణులైన పాలిటెక్నిక్ విద్యార్థులకు సెప్టెంబర్ 7 నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుంది.
ఈసెట్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
11వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 12న ధ్రువపత్రాల పరిశీలన, 9 నుంచి 14 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుందని Telangana Council of Higher Education తెలిపింది. సెప్టెంబర్ 17న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సీటు వచ్చిన అభ్యర్థులు 22వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని, తుది దశ కౌన్సెలింగ్ 25వ తేదీ నుంచి మొదలవుతుందని తెలిపారు.