Skip to main content

TS EAPCET 2024 Exam Exam Schedule Change: టీఎస్‌ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు!

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఈఏపీసెట్‌ (ఎంసెట్) రాతపరీక్షల షెడ్యూల్ ని మార్చాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
New schedule for TSE APSET exams   TS EAPCET Exam Dates Change   Hyderabad Higher Education Council

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మే 13న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 9 నుంచి 12 వరకు టీఎస్‌ఈఏపీసెట్‌ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తొలుత ప్రకటించింది.

అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీఎస్‌ఈఏపీసెట్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని భావిస్తున్నది. మే 8 నుంచి 11వ తేదీ వరకు టీఎస్‌ఈఏపీసెట్‌ రాతపరీక్షలను నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.

>> College Predictor - 2023 - AP EAPCET TS EAMCET

సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశమున్నది. మే 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్ రాతపరీక్షలు.. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు షెడ్యూల్ ని రూపొందించినట్టు సమాచారం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

>> Top 20 Engineering Colleges 2023 - Andhra Pradesh Telangana
టీఎస్‌ఈఏపీసెట్‌కు 1.68 లక్షల దరఖాస్తులు

రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఈఏపీసెట్‌ (ఎంసెట్)కు 1,68,798 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు టీఎస్‌ఈఏపీసెట్‌ కన్వీనర్ బి డీన్ కుమార్, కోకన్వీనర్ కె విజయకుమార్ రెడ్డి మార్చి 19న‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇంజినీరింగ్ విభాగానికి 1,18,387 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 50,265 మంది, ఆ రెండు విభాగాలకూ 146 మంది కలిపి మొత్తం 1,68,798 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్  6వ‌ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే. ఇతర వివరాల కోసం https://eapcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
 

Published date : 20 Mar 2024 05:45PM

Photo Stories