Skip to main content

తెలంగాణ ఎంసెట్– 2021 దరఖాస్తుల గడువు జూన్ 3 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల గడువును జూన్ 3వ తేదీ వరకు పొడిగించారు.
అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కనీ్వనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. బుధవారం వరకు 2,01,367 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్ కోసం 1,35,151 మంది, అగ్రికల్చర్ కోసం 66,216 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.

తెలంగాణ ఎంసెట్– 2021 స్టడీ మెటీరియల్, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్, బిట్ బ్యాంక్స్, మోడల్ పేపర్స్, ప్రిపరేషన్ గైడెన్స్, కాలేజ్ ప్రిడిక్టర్... ఇతర తాజా అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 27 May 2021 12:00PM

Photo Stories