Skip to main content

2021-22 Vivo Pro Kabaddi League: ప్రొ కబడ్డీ ఎనిమిదో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించిన జట్టు?

Dabang Delhi

2021–22 Pro Kabaddi League season: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో దబంగ్‌ ఢిల్లీ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫిబ్రవరి 25న బెంగళూరు వేదికగా హోరాహోరీగా జరిగిన ఎనిమిదో సీజన్‌(2021–22 వివో ప్రొ కబడ్డీ లీగ్‌) ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్‌ పట్నా జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.

బెస్ట్‌ డిఫెండర్‌గా మొహమ్మద్‌ రెజా..

పీకేఎల్‌ ఎనిమిదో సీజన్‌లో నవీన్‌ (ఢిల్లీ; రూ. 20 లక్షలు) ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’గా, మోహిత్‌ గోయట్‌ (పుణేరి పల్టన్‌; రూ. 8 లక్షలు) ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’గా, మొహమ్మద్‌ రెజా (పట్నా; రూ. 15 లక్షలు) ‘బెస్ట్‌ డిఫెండర్‌’గా, పవన్‌ సెహ్రావత్‌ (బెంగళూరు బుల్స్‌; రూ. 15 లక్షలు) ‘బెస్ట్‌ రెయిడర్‌’గా అవార్డులను సొంతం చేసుకున్నారు.

చ‌ద‌వండి: అజిత్‌ అగార్కర్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రొ కబడ్డీ ఎనిమిదో సీజన్‌లో చాంపియన్‌గా అవతరించిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు    : దబంగ్‌ ఢిల్లీ జట్టు
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ఫైనల్లో దబంగ్‌ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Feb 2022 03:01PM

Photo Stories