Skip to main content

హైదరాబాద్ లో National volleyball పోటీలు

గ్రామస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ బీచ్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు ఎంసీహెచ్‌ఆర్‌ కృష్ణంరాజు ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిలో ఆగస్టు 10 నుంచి నాలుగు రోజులపాటు జాతీయ వాలీబాల్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.
volleyball
volleyball

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్‌ జ్యోతి విద్యాలయ పూర్వ విద్యార్థులు, వాలీబాల్‌ క్రీడాకారులు ఈ పోటీలకు శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా అంతర్జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు కృష్ణంరాజు ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో వాలీబాల్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రారంభమైన ఈ పోటీలు నేడు జాతీయస్థాయికి చేరుకున్నాయి.   

Also read: GST Council Meet : రాష్ట్రానికో జీ20 టీమ్‌

ఈ జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడా పోటీల్లో సుమారు 80 టీంలు, సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Aug 2022 06:02PM

Photo Stories