National Inter Institutional Table Tennis: శ్రీజకు స్వర్ణం
Sakshi Education
జాతీయ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, స్నేహిత్ రాణించారు.
sreeja
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరపున బరిలోకి దిగిన శ్రీజ మహిళల సింగిల్స్లో తొలిసారి స్వర్ణం సాధించింది. ఫైనల్లో శ్రీజ 11–6, 11–7,13–11, 11–5తో మౌమితా దత్తా (ఆర్ఎస్పీబీ)పై గెలిచింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున పోటీపడిన స్నేహిత్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 12–10, 7–11, 13–11, 7–11, 8–11, 4–11తో మనుష్షా (ఆర్బీఐ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం సాధించాడు. శ్రీజ, స్నేహిత్ ప్రదర్శనపట్ల వీరిద్దరి కోచ్ సోమ్నాథ్ ఘోష్ ఆనందం వ్యక్తం చేశాడు.