Skip to main content

MS Dhoni: ఎన్‌సీసీ కమిటీలో సభ్యుడిగా నియమితులైన క్రికెట్‌ దిగ్గజం?

Dhoni

భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్‌సీసీని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌సీసీ కమిటీ చర్చిస్తుంది.

పంకజ్‌ అద్వానీకి ఆసియా స్నూకర్‌ టైటిల్‌... 

భారత మేటి ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ ఆసియా స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఖతార్‌ రాజధాని దోహాలో సెప్టెంబర్‌ 16న జరిగిన ఫైనల్లో పంకజ్‌ 6–3 ఫ్రేమ్‌ల తేడాతో అమీర్‌ సర్ఖోష్‌ (ఇరాన్‌)పై గెలిచాడు. స్నూకర్, బిలియర్డ్స్‌ క్రీడాంశాల్లో కలిపి పంకజ్‌ ఖాతాలో ఇప్పటివరకు 11 ఆసియా టైటిల్స్‌ చేరడం విశేషం. 2019లో పంకజ్‌ విజేతగా నిలువగా... కరోనా కారణంగా 2020 ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించలేదు.

చ‌ద‌వండి: పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) కమిటీలో సభ్యుడిగా నియామకం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 15
ఎవరు    : భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని
ఎందుకు : ఎన్‌సీసీని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు...

 

Published date : 17 Sep 2021 07:40PM

Photo Stories