Skip to main content

Indian Premier League: ఐపీఎల్‌లో కొత్తగా చేరిన జట్ల పేర్లు?

IPL New Teams

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు చేరాయి. దీంతో లీగ్‌లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఈ రెండు జట్లకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) బిడ్డింగ్‌ ప్రక్రియను నిర్వహించింది. ఈ ప్రక్రియలో భాగంగా అక్టోబర్‌ 25న టెండర్లు తెరువగా... భారత కార్పొరేట్‌ సంస్థ గోయెంకా గ్రూప్, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్‌ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్‌)లు వరుసగా లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. లక్నో కోసం రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్‌ లిమిటెడ్‌ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్‌ డాలర్లు) వెచ్చించింది. ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్‌) రూ. 5,625 కోట్లతో అహ్మదాబాద్‌ను దక్కించుకుంది. 2022లో జరిగే ఐపీఎల్‌ –15 సీజన్‌లో లక్నో, అహ్మదాబాద్‌ క్రికెట్‌ జట్లు బరిలోకి దిగుతాయి.

చ‌దవండి: ఐపీఎల్‌ 14వ సీజన్ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్ అవార్డు ఎవ‌రికి ల‌భించింది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Oct 2021 04:30PM

Photo Stories