FIH Nations Cup: నేషన్స్ కప్ మహిళల హాకీ టోర్నీ విజేతగా భారత్
Sakshi Education
తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది.
![](/sites/default/files/images/2022/12/19/womens-hocky-team-1671453297.jpg)
డిసెంబర్ 17న వాలెన్షియా (స్పెయిన్)లో జరిగిన ఫైనల్లో సవితా పూనియా నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్ తేడాతో ఆతిథ్య స్పెయిన్ జట్టును ఓడించింది. ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గుర్జీత్ కౌర్ గోల్గా మలిచింది. ఈ విజయంతో భారత్ 2023–2024 ప్రొ లీగ్కు నేరుగా అర్హత సాధించింది. టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులకు రూ.2 లక్షల చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది.
ICC Ranking: ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో స్మృతికి మూడో స్థానం
Published date : 19 Dec 2022 06:04PM