Skip to main content

Badminton: ఇండియా ఓపెన్‌ పురుషుల టైటిల్‌ సొంతం చేసుకున్న ద్వయం?

Sathwik-Chirag

ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం(భారత్) విజేతగా నిలిచింది. జనవరి 16న న్యూఢిల్లీ వేదికగా ముగిసిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంక్‌ జంట సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి 21–16, 26–24తో ప్రపంచ రెండో ర్యాంక్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన మొహమ్మద్‌ ఎహ్‌సాన్‌–హెంద్రా సెతియవాన్‌ (ఇండోనేసియా) జోడీ ని ఓడించి, టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టి ద్వయానికి ఇది రెండో సూపర్‌ –500 స్థాయి టైటిల్‌ కావడం విశేషం. 2019లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జోడీ అదే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 31,600 డాలర్లు (రూ. 23 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.      

పురుషుల సింగిల్స్‌లో..

పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ లో కీన్‌ యు (సింగపూర్‌)ను ఓడించి భారత యువస్టార్‌ లక్ష్య సేన్‌ విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 24–22, 21–17తో కీన్‌ యుపైగెలుపొంది కెరీర్‌లో తొలి సూపర్‌–500 టైటిల్‌ సాధించాడు. విజేతగా నిలిచిన లక్ష సేన్‌కు 30 వేల డాలర్లు (రూ. 22 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
చదవండి: అండర్‌–19 వరల్డ్‌కప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్ గెలుచుకున్న జోడీ?
ఎప్పుడు : జనవరి 16
ఎవరు    : సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం(భారత్)
ఎక్కడ    : న్యూఢిల్లీ 
ఎందుకు : ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–16, 26–24తో మొహమ్మద్‌ ఎహ్‌సాన్‌–హెంద్రా సెతియవాన్‌ (ఇండోనేసియా) ద్వయంపై గెలిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Jan 2022 05:48PM

Photo Stories